ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచదేశాల ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు తీవ్ర స్థాయిలో వణికిపోతున్నారు. ఇక ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో అటు ప్రభుత్వాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు తీవ్రంగా కుదేల్ అవుతుంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారత్లోనూ రోజురోజుకు కరోనా విజృంభిస్తూ వస్తోంది. అయితే ఇప్పటికే భారత్లో కరోనా కట్టడి చేసేందుకు కేంద్రం లాక్డౌన్ విధించింది.
దీంతో నిత్యవసర వస్తువులు తప్పా.. అన్ని సంస్థలు మూతపడ్డారు. మరియు ప్రజలను బటయకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా బయటకు వచ్చినా.. పోలీసులు లాటీలతో తాట వలిచేస్తున్నారు. సమాన్యులతో పాటు షూటింగ్స్ లేక సెలబ్రెటీలు సైతం లాక్డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటుంది. అయితే ఈ లాక్డౌన్ టైమ్లో కొందరు సెలబ్రెటీలు మేకప్ ఛాలెంజ్ను స్టాట్ చేశారు. ఇక తాజాగా ఈ ఛాలెంజ్లో మెగా లేడీస్ కూడా పాల్గొన్నారు. ముందుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మేకప్ చాలెంజ్ స్టాట్ చేసింది.
ఆ తర్వాత నిహారిక, చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డితో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ ఇందులో పార్టిసిపేట్ చేసారు. ఈ సాంగ్ను నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ మేర సూట్ పటియాలా కితనోంకొ మార్ డాలా’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్గా వాడారు. ఇక ఈ పాటకు తగ్గట్లు స్టెప్పులేస్తూ.. మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ అంతా డ్యాన్స్ ఇరగదీసారనే చెప్పాలి. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.