బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా రామరాజు టీజర్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. ఇక ఈ నెల 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి మరో టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 

 

మహేష్ హీరోగా రాజమౌళి జేమ్స్ బాండ్ రేంజ్ సినిమా చేస్తారని అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం జక్కన్న తమ హీరోతో మరో బాహుబలి లాంటి సినిమా చేయాలని అడుగుతున్నారు. మహేష్ కూడా హిస్టారికల్ మూవీకే ఓటు వేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఎన్టీఆర్ కు సరిపోయే ఓ కథ సిద్ధం చేశాడట విజయేంద్ర ప్రసాద్. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ సినిమా ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో ఇప్పటికే స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు చేసిన రాజమౌళి రౌద్రం రణం రుధిరం సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కు షురూ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కూడా మరో సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి. మరి ఈ కాంబో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.             

మరింత సమాచారం తెలుసుకోండి: