కరోనా వైరస్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇప్పట్లో తగ్గుముఖం పట్టే ప్రసక్తే కనిపించట్లేదు. అయితే ఈ ప్రాణాంతకర వైరస్ను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించారు. అయితే రోజుల తరబడి లాక్డౌన్ను అమలు చేసినా కరోనా అదుపులోకి రావడం లేదు. అయితే ఈ లాక్డౌన్ కాలంలో ఎందరో సినీ ప్రముఖులను ఇండస్ట్రీలో కోల్పోయింది.
అందులో ముందుగా.. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్. కేన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
శ్రీలక్ష్మి కనకాల.. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి.. స్టార్ యాంకర్ సుమ కనకాల ఆడపడుచు శ్రీ లక్ష్మీ కనకాల ఏప్రిల్ 6న మృతి చెందారు. పలు టీవీ సీరియల్స్లో నటింటి మంచి నటిగా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మీ క్యాన్సర్ తో బాధపడుతూ.. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చనిపోయారు.
సచిన్ కుమార్.. ఏక్తా కపూర్ నటించిన 'కహానీ ఘర్ ఘర్ కీ' సినిమాలో హీరోగా నటించిన సచిన్ కుమార్ గుండె పోటుతో కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం విషాదకరం. మే 13న పుట్టిన రోజు జరుపుకున్న ఆయన మే 16న అకాల మరణం చెందడంతో ఆయన సన్నిహిత వర్గాలు షాక్ అయ్యాయి.
బుల్లెట్ ప్రకాష్.. ప్రముఖ కన్నడ హాస్య నటుడు బుల్లెట్ ప్రకాష్ ఏప్రిల్ 7న మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 300 సినిమాలకు పైగా కన్నడ సినిమాల్లో కామెడీ పాత్రల్లో మెప్పించాడు ప్రకాష్.
రిషి కపూర్.. ప్రముఖ హిందీ నటుడు రిషీ కపూర్ ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరిగా.. చికిత్స పొందుతూ మరణించారు. రిషి కపూర్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
వాజిద్ ఖాన్.. బాలీవుడ్లో ఎన్నో సినిమాలకు అదిరిపోయే సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్.. కేవలం 42 ఏళ్ల వయసులో కిడ్నీ సమస్యతో పాటు కరోనా వైరస్ కారణంగా జూన్ 1న మృతిచెందారు.
సాయి గుండేవార్.. అమీర్ ఖాన్ పీకే, రాక్ ఆన్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి గుండేవార్ మే 10న బ్రెయిన్ కాన్సర్తో బాధ పడుతూ యుఎస్లో మృచెందారు. ఇక వీరితో పాటు మోహిత్ భాగెల్, మన్మీత్ గ్రేవాల్, యోగేష్ గౌర్, ప్రేక్షా మెహతా వంటి సిపీ ప్రముకులు కూడా లాక్డౌన్ వేల మృతి చెందారు.