‘అయ్యప్పన్ కోషియమ్’ మళయాళంలో సంచలన విజయంసాధించిన మూవీ. ఒక రిటైర్డ్ హవాల్దారుకి ఒక పోలీస్ ఆఫీసర్ కి మధ్య చెలరేగిన బలమైన ఇగో ల చుట్టూ ఈసినిమా కథ సాగుతుంది. ఈ మూవీ రీమేక్ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఈ మూవీ హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంది.


ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఈ మూవీలోని హవాల్దారు పాత్రను పోషించిన పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానా ని ఓకే చేసి ఇక మరో కీలక పాత్ర అయిన బిజూ మీనన్ పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలని ఇప్పటి వరకు ప్రయత్నాలు చేసారు. కానీ ఈసినిమాలో పాటలు ఫైట్లు హీరోయిన్లు లేకుండా కేవలం ఎమోషన్ల మీద నడిచే కథ కావడంతో బాలకృష్ణ అనేక ఆలోచనలు చేస్తూ ఇంకా ఏ నిర్ణయం చెప్పకుండా రోజులు గడుపుతున్న పరిస్థితులలో వెంకటేష్ తాను రానా తో కలిసి ఈ రీమేక్ లో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో బాలకృష్ణ కన్ఫ్యూజన్ ఒకమంచి సినిమాను దూరం చేసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. బాలయ్య మారిన పరిస్థితులు పట్టించుకోకుండా ఇంకా హీరోయిన్స్ తో స్టెప్స్ వేసే పాటల కోసం అదేవిధంగా మీసం మెలివేసే పాత్రల కోసం తన మోజును తగ్గించుకోకపోతే ఇలాంటి మంచి అవకాశాలు మిస్ అవుతాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు టాక్. వాస్తవానికి హరీష్ శంకర్ ఈ మూవీకి దర్శకుడుగా న్యాయం చేయగలడని ఆలోచనలు వచ్చినా అతడు ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉన్న పరిస్థితులలో మరెవ్వరైనా యంగ్ డైరెక్టర్ కు ఈమూవీ బాధ్యతను అప్పగించాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: