వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండే కింగ్ నాగార్జున ఈమధ్య సినిమాల మీద ఆసక్తి తగ్గించాడా.. అదేంటి టాలీవుడ్ మన్మధుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గుతుంది. ఎప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ అన్నపూర్ణ బ్యానర్ లో కొత్త సినిమాలు చేసే నాగ్ ఎందుకు సైలెంట్ అయ్యాడు అంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను ఇవ్వడం లేదన్నది ఒక కారణం కాగా.. మరోటి తన మనసుకి నచ్చే కథలు తన దగ్గరకు రావడం లేదన్నది మరో రీజన్ అని తెలుస్తుంది.

 

కొత్త కథ ఎక్కడ ఎవరైనా సరే అన్నపూర్ణ స్టూడియో గేట్లు తెరచి ఉంటాయి. అలాంటిది నాగార్జునకు ఈమధ్య నచ్చే కథలే దొరకడం లేదు. అంతేకాదు ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాలు డిజాస్టర్స్ గా మిగలడం తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్టుగా భావిస్తున్నాడట. అంతేకాదు కథల విషయంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రధాన్యత ఇచ్చే నాగ్ రొటీన్ రెగ్యులర్ కథ కావాలి దానితో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడట. ప్రస్తుతం నాగార్జున సోలోమన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత నాగార్జున గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

ఇదే కాకుండా కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించే రుద్ర సినిమాలో కూడా నాగ్ నటిస్తాడని తెలుస్తుంది. తనయులు హీరోలుగా మారిన తర్వాత తన దూకుడు తగ్గించిన నాగార్జున మళ్లీ మునుపటి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. వైల్డ్ డాగ్ మీద అక్కినేని ఫ్యన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: