రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాహుబలి రెండు భాగాలతో పాటు ఇటీవల రిలీజ్ అయిన సాహో సినిమాతో మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఇటీవల కరోనా మహమ్మారి వ్యాప్తం కావడానికి ముందు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, అతి త్వరలో రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లోమిగతా షూటింగ్ జరుపాలని నిర్ణయించిందట. 

IHG

కొన్నేళ్ల క్రితం జరిగిన రెట్రో ప్రేమకథగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజ ఇద్దరూ కూడా మంచి డిఫరెంట్ లుక్స్ లో కనపడనున్నట్లు సమాచారం. బాలీవుడ్ ఒకప్పటి సీనియర్ నాయిక భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటలు టైటిల్ ఈపాటికే రిలీజ్ కావలసి ఉండగా, మధ్యలో కరోనా సహా పలు అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. దానితో కొన్నాళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ లో నిరాసక్తి మొదలై, కొన్నాళ్లుగా వారు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నిర్మాతలపై కొంత విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

అయితే తమ సినిమా టైటిల్, తో పాటు ఫస్ట్ కూడా సిద్ధం అవుతోందని, డార్లింగ్ అభిమానులు ఏ మాత్రం నిరాశాచండవద్దని, కొంత ఆలస్యం అయినప్పటికి కూడా మీ అందరినీ అలరించే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండనున్నట్లు వారు తెలిపారు. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. రాధే శ్యామ్, ఓ డియర్ అనే రెండు టైటిల్స్ లో ఒకటి ఫైనల్ టైటిల్ గా ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. అలానే దీనికి సంబందించిన ప్రకటన కూడా నేడో, రేపో రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న పండుగ రోజు వచ్చేసినట్లే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: