కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభంతో సినిమాలే కాదు బుల్లితెర షోలు క్యాన్సిల్ అయ్యాయి. సీరియల్స్ కు పోటీగా ఈమధ్య తెలుగులో ఎంటర్టైన్మెంట్స్ షోస్ బాగా క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా సుమ క్యాష్.. ఈటివి జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మి.. పటాస్ తో రాములమ్మగా శ్రీముఖి ఇలా అందరు వాళ్ల వాళ్ల టాలెంట్ తో దుమ్ముదులిపేస్తున్నారు. ఇక ఆఫ్టర్ లాక్ డౌన్ మళ్లీ షూటింగ్స్ కు సిద్ధమవుతున్నారు.

 

అయితే ఇప్పుడు పరిస్థితి అంతగా బాగాలేని కారణంగా షోలు నడవాలంటే తమ రెమ్యునరేషన్ తగ్గించుకోక తప్పదని భావిస్తున్నారు. అందుకే షో నిర్వాహకులు కోరినట్టుగా స్టార్ యాంకర్స్ వారి రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటున్నారు. క్యాష్ షోకి మాములుగా అయితే ఎపిసోడ్ కు 2 లక్షలు తీసుకునే సుమ ఇప్పుడు ఎపిసోడ్ కు లక్ష తగ్గించిందట. ఇక అనసూయ, రష్మిలు కూడా తమ రెమ్యునరేషన్ తగ్గించేశారట. శ్రీముఖి కూడా కొత్త షోలకు ఇదివరకు కన్నా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేలా ప్లాన్ చేస్తుందట.

 

ఓ విధంగా షో నిర్వాకులు అడగ్గానే యాంకర్లు, బుల్లితెర స్టార్స్ ఇలా రెమ్యునరేషన్ తగ్గించడం ఓవిధంగా మంచి పరిణామనే చెప్పాలి. అయితే వీళ్లలా తగ్గించకపోతే అసలకే మోసం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే వీరు కూడా ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు అడగ్గానే రెమ్యునరేషన్ తగ్గించుకుని షోలు చేసేందుకు సై అంటున్నారు. 3 నెలల గ్యాప్ తో మళ్లీ బుల్లితెర మీద సందడి చేసేందుకు షోస్ రెడీ అవుతున్నాయి. మరి వీరి హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే షోలు స్టార్ట్ అయ్యి ప్రోమోలతో అదరగొడుతుంటే బుల్లితెరకు పూర్వ వైభవం వచ్చినట్టే అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలే మిలియన్ మార్క్ వ్యూ కౌంట్ సాధించడం విశేషం.               

మరింత సమాచారం తెలుసుకోండి: