తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ పేరు తెచ్చుకున్న నిర్మాత అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సినిమాల్ని తెరకెక్కిస్తారు. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో వచ్చిన చిత్రాల లిస్టు చాలా పెద్దగా ఉంది. మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ సినిమాతో నిర్మాతగా మారిన అనిల్ సుంకర, ఆ సినిమాతో విజయాన్ని అందుకుని ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినప్పటికీ అవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.

 

 

కానీ మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న అనిల్ సుంకరకి మంచి విజయం దక్కింది. అయితే ప్రస్తుతం నిర్మాతలందరూ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లు తీసే ఆలోచనలో ఉన్నారు. జనాలు ఓటీటీలకి బాగా అలవాటు పడిన సంగతి తెలిసిందే. సరైన కంటెంట్ ఉండి సరిగ్గా చెప్పగలిగే వారికి ఓటీటీ ఓ అద్భుత అవకాశం.

 

 

అయితే ఈ వేదికగా వెబ్ సిరీస్ ని రూపొందించడానికి అనిల్ సుంకర ముందుకు వచ్చారు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన మధుబాబు నవలా సిరీస్ షాడో ని ఎంచుకున్నాడు. నేటి తరం వారికి ఈ షాడో సిరీస్ గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ నవలా సిరీస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.  అయితే ఆ సిరీస్ ఇప్పుడు దృశ్యరూపంలోకి రాబోతుంది. ఈ మేరకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ వెల్లడించాడు.

 

 

ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే భారతదేశం యొక్క అతిపెద్ద నవల ఫ్రాంచైజీకి విజువల్ ఫార్మాట్ ఇవ్వడానికి మమ్మల్ని విశ్వసించినందుకు ధన్యవాదాలు మధుబాబు గారు అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరి ఈ థ్రిల్లర్ సిరీస్ లో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: