కన్నడ భాషలో ఇటీవల తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక మందన్న. నటించిన తొలి సినిమాతోనే అక్కడ మంచి సక్సెస్ అందుకున్న రష్మిక, ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి రష్మిక కు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి, వాటితో కూడా సూపర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. 

 

ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన  పుష్ప మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ లెవల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక ఇద్దరు కూడా మాస్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక తన ఊర మాస్ లుక్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని సమాచారం. 

 

ఇప్పటివరకు తాను నటించిన దాదాపుగా అన్ని సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్,  రొమాంటిక్ పాత్రల్లోనే కనిపించానని, అయితే తొలిసారిగా ఈ సినిమాలోని పాత్ర ద్వారా ఊర మాస్ లుక్ తో, అలరించే నటనతో ప్రేక్షకులు సహా, తన అభిమానులందరి నుండి కూడా శభాష్ అనిపించుకుంటానని, ఇటీవల తన సన్నిహితుల వద్ద సరదాగా మాట్లాడుతూ చిన్న ఛాలెంజ్ చేసిందట రష్మిక. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఇందులో రష్మిక రోల్, అలానే ఆమె నటన ఏ రేంజ్ లో అదిరిపోనుందో తెలియాలి అంటే, సినిమా రిలీజ్ సమయం వరకు వేచి చూడాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: