స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాను మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అనసూయని అడిగినట్టు తెలుస్తుంది.

సినిమాలో అనసూయ కోసం ఓ డీ గ్లామరస్ పాత్రని అనుకున్నాడట సుకుమార్. ఆమెకు ఆల్రెడీ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఇచ్చాడు. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రకు అనసూయ న్యాయం చేసింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అలాంటి పాత్ర ఒకటి ఇచ్చారట. అయితే అనసూయ మాత్రం ఆ పాత్రని చేయనని నిర్మొహమాటంగా చెప్పేసిందని తెలుస్తుంది. పుష్ప సినిమాలో అనసూయ మంచి ఛాన్స్ మిస్ అయినట్టు చెప్పుకుంటున్నారు.

మాములు పాత్ర అయినా అనసూయ చేసే ఆ పాత్రకు స్పెషల్ ఎట్రాక్షన్ వస్తుంది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న రనమార్తాండా సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె తన పాత్రతో అందరికి షాక్ ఇస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఆడియెన్స్ అంచనాలను మించి అనసూయ తన పాత్రతో మెప్పిస్తుందని అంటున్నారు. ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై తన సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా అనసూయ అదరగొట్టేస్తుంది. అమ్మడి ఫాం చూస్తుంటే మరికొన్నాళ్లు ఇదే పాపులారిటీ తెచ్చుకునేలా ఉంది.                                                                            



మరింత సమాచారం తెలుసుకోండి: