ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు "బాహుబలి" సినిమా తో దేశవ్యాప్తంగా నలు మూలల తన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్ని కోట్ల ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇక "బాహుబలి" తరువాత "సాహో"సినిమా తీసి మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్లాప్ అయినా కాని బాలీవుడ్ లో మాత్రం ఒక రేంజిలో హిట్ అయ్యింది. రెబల్ స్టార్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది ఈ సినిమా. ఇక పాన్ ఇండియా సినిమాలకు  కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా నేషనల్ వైడ్ గా రూమర్స్ వైరల్ అవ్వడం సర్వ సాధారణం. అయితే రూమర్స్ క్రియేట్ అయితే వెంటనే క్లారిటీ ఇచ్చే గుణమున్న మంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కొత్త సినిమాపై కూడా పుకార్లని రానివ్వడానికి ఇష్టపడటం లేదు. కొన్నిసార్లు రూమర్స్ ఎన్ని వచ్చినా దర్శకులు పట్టించుకోరు.అయితే కెజిఎఫ్  దర్శకుడు ప్రశాంత్ నీల్  మాత్రం తనవరకు చిన్న గాసిప్ వచ్చినా వెంటనే క్లారిటీ ఇస్తుంటాడు. అది ఎలాంటిదైనా సరే సినిమాపై ప్రభావం పడకూడదని అనుకుంటాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సలార్ రీమేక్ కథ అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి.

అది కూడా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్ కథకు రీమేక్ అని రూమర్స్ రాగా వెంటనే క్లారిటీ ఇచ్చేశారు.అందులో ఎలాంటి నిజం లేదని అంటూ సలార్ కథ పూర్తిగా కొత్తగా రాసుకున్నదనేని లాక్ డౌన్ లో స్టోరీ మొత్తం పూర్తయినట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు. దీంతో అభిమానుల కన్ఫ్యూజన్ కు కూడా ఎండ్ కార్డ్ పడింది. ఇక దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ 2 ప్రీ ప్రొడక్షన్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

ఆ పనులు పూర్తయి పోయిన  వెంటనే సలార్ ను సెట్స్ పైకి తీసుకు రావాలని అనుకుంటున్నారు. మరి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: