సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట. బ్యాంకులను కుదిపేసిన ఆర్ధిక నేరాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు, కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు టాక్.

మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు దుబాయ్ లో ప్రారంభం కాబోతోంది. కాగా కొద్దిసేపటి క్రితం తమ మూవీ షూటింగ్ నేడు షురూ అవుతోంది, ఆక్షన్ తో పాటు యాక్షన్ కూడా నేడు బిగిన్ అంటూ ఒక మోషన్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది యూనిట్.

దానితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మీడియా మాధ్యమాల్లో దానిని మరింతిగా వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక దుబాయ్ లో 25 రోజుల షూటింగ్ అనంతరం యూనిట్ హైదరాబాద్ చేరుకొని ఇక్కడ దాదాపుగా 40 రోజులు షూట్ నిర్వహిస్తారని, ఆ తరువాత అమెరికా, జార్జియా దేశాల్లో మిగతా పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. మొత్తంగా తమ హీరో సినిమా నేడు మొదలు కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: