బేబమ్మ .. మొన్నటి వరకు ఈ పేరంటే ఎవరు తెలియదు. కానీ ఇప్పుడు యూత్ అంత జపం చేసే పేరు అయ్యింది. ఉప్పెన మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ కేక్ అయ్యింది. సాధారణంగా ఏ హీరోయిన్ కైనా మొదటి మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ మూవీ ఛాన్స్ వస్తాయి. కానీ కృతి శెట్టికి మాత్రం మొదటి మూవీ రిలీజ్ కాకముందే రెండు మూవీస్ లలో ఛాన్స్ వచ్చి అమ్మడి రేంజ్ పెంచాయి. ఇక మొదటి మూవీ ఉప్పెన రిలీజ్ అవ్వగానే అమ్మడి కోసం పరుగులుపెట్టడం స్టార్ట్ చేసారు నిర్మాతలు.

సినిమా విజయంలో సగం దేవి శ్రీ అయితే , మిగతా సగం కృతి గ్లామర్ , నటన అనే చెప్పాలి. అంతలా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఎన్నో చిత్రాల్లో ఎక్స్పీరియన్స్  ఉన్నట్లు నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి శ్యామ్ సింఘ‌ రాయ్‌ తో పాటు సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న మూవీస్ లలో నటిస్తుంది. ఇవే కాదు రామ్ - లింగుస్వామి కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ లోను ఈమెనే అనుకుంటున్నారట.

అంతే కాదు మరికొంతమంది దర్శక , నిర్మాతలు ఈమెను సంప్రదిస్తున్నారట. ఇలా వరుస ఆఫర్లు తలుపు తడుతుండడం తో ఈమె తన రెమ్యూనరేషన్ ను కోటికి పెంచినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. మొదటి సినిమాకు కేవలం రూ. 25 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు చెపుతున్నారు. కానీ ఇప్పుడు వరుసగా ఆమెకు ఛాన్సులు వస్తుండడం తో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మాదిరిగా క్రేజ్ ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలని అనుకుంటుందట.                       

మరింత సమాచారం తెలుసుకోండి: