సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. దానికి కారణంగా ఇటీవల వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న మహేష్ తప్పకుండా ఈ మూవీ తో మరొక హిట్ అందుకుంటారని పలువురు భావిస్తుండగా, తొలిసారిగా మహేష్ తో పరశురామ్మూవీ తీస్తుండడం కూడా ఈ మూవీ పై ఈ రేంజ్ అంచనాలకు కారణం అని తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక వెరైటీ పాత్ర చేస్తున్నారని, తప్పకుండ ఆయన పాత్ర ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లోజరిగింది. ఇక దీని రెండవ షెడ్యూల్ ని మరొక్కమారు దుబాయ్ లోనే నిర్వహించనున్నట్లు టాక్. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో కె ఎల్ నారాయణ నిర్మాతగా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న భారీ సినిమాలో మహేష్ బాబు నటించనున్నారు. తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే పక్కాగా ఉంటుంది అంటూ ఇటీవల రాజమౌళి కూడా స్వయంగా ప్రకటన చేసారు. అందుతున్న సమాచారాన్ని బాట్టి ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి లో పట్టాలెక్కనున్నట్లు చెప్తున్నారు.

అయితే దీని తరువాత మహేష్ తో సినిమాలు చేసేందుకు ఇప్పటికే పలువురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారని, ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ తీస్తోన్న ప్రశాంత్ నీల్ కూడా ఆ దర్శకుల లిస్ట్ లో ఉన్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. సలార్ తరువాత  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో ఒక సినిమా తీయనున్న ప్రశాంత్, ఆపై మహేష్ తోనే ఒక సినిమా తీయనున్నారని, ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి తన బృందంతో కలిసి కథ ని సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ నిమగ్నమై ఉన్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: