నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా అఖండ. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు టీజర్లు కూడా ఆడియన్స్ మంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు అవి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా యువ సంగీత సెన్సేషన్ తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా తర్వాత ఇటీవల క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన అతి త్వరలో రానుందని ఇప్పటికే బాలయ్య కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ రాసుకున్న దర్శకుడు గోపీచంద్ ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని అంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో బాలయ్య ఒక పోలీసు అధికారి పాత్రలో చేయనున్నారని కొద్దిరోజులుగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఒక రాఏజెంట్ గా కనిపించనున్నారని ఒకరకంగా గూడచారి తరహాలో ఆయన పాత్ర ఈ సినిమాలో సాగుతుందని మంచి యాక్షన్ తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని దీనిని తెరకెక్కించనున్నాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: