ప్రభాస్ టాలీవుడ్ లో ఓ ఆణిముత్యం. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా ఇండస్ట్రీ హిట్ అయినప్పటి నుండి ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకులు మరియు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఒక టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి కూడా ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సినీ కెరీర్ మంచి లైన్ లో ఉంది. ప్రభాస్ త్వరలోనే రాధే శ్యాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కరోనా కారణంగా మరికొంత కాలం ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగు దశలో ఉంది.

కానీ తాజాగా ఆ షూటింగు కూడా కరోనా వలన వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనునున్నారు.  ఇది ఇలా ఉండగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ హృతిక్ రోషన్ హీరోగా చేసిన వార్ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ప్రభాస్ తో వార్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.  ప్రభాస్ కూడా దీనికి ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ వార్తలన్నీ నిజం కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజముందని తెలిసింది.

అంతే కాకుండా ఇప్పటికే సిద్దార్ధ్ ఆనంద్ కు ఈ సినిమా చేయడానికి ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. మరో వైపు స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఒక్కరే నిర్మిస్తారా లేదా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి చేస్తారా అంది తెలియాల్సి ఉంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కానీ ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: