ఇక ఈ మూవీ ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలో నటించనున్నారు మహేష్ బాబు. ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అలానే మరోవైపు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా తదుపరి సినిమాలు మహేష్ తో చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు సూపర్ స్టార్ కు కథలు వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, ప్రస్తుతం ఆయా కథల యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసేపనిలో వీరిద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటు అనిల్ రావిపూడి, ఇటు వంశీ పైడిపల్లి లలో ముందుగా ఎవరికి సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తారు అనేది ప్రస్తుతం అందరిలోనూ కొంత ఉత్కంఠగా మారిందని, అయితే పక్కాగా మహేష్ వీరిలో తదుపరి ఎవరితో మూవీ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మాత్రం మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు ..... !!