టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఒక్కో సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ నటుడిగా మరింత గొప్ప క్రేజ్ దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ప్రస్తుత కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం ప్రారంభం కానుంది.

ఇక ఈ మూవీ ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలో నటించనున్నారు మహేష్ బాబు. ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అలానే మరోవైపు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా తదుపరి సినిమాలు మహేష్ తో చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు సూపర్ స్టార్ కు కథలు వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, ప్రస్తుతం ఆయా కథల యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసేపనిలో వీరిద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటు అనిల్ రావిపూడి, ఇటు వంశీ పైడిపల్లి లలో ముందుగా ఎవరికి సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తారు అనేది ప్రస్తుతం అందరిలోనూ కొంత ఉత్కంఠగా మారిందని, అయితే పక్కాగా మహేష్ వీరిలో తదుపరి ఎవరితో మూవీ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మాత్రం మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు ..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: