టాలీవుడ్
హీరోయిన్ అనుష్క శెట్టి ఇకపై సినిమాలు మానేస్తుందట. ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి యాక్టింగ్ మానేసి
పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలని ఆమె ప్లాన్ చేస్తోందని ఫిల్మ్
నగర్ సర్కిల్ లో కూడా వార్తలు వస్తున్నాయి. సూపర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన
అనుష్క కోట్లాదిమంది తెలుగు ఆడియన్స్ కు
డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
ఇండస్ట్రీ కంటే ముందు
యోగా టీచర్ గా చేసినా ఆమె తన అందంతో అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.
యోగా టీచర్ గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను
హీరోయిన్ గా చేయగా ఆ తర్వాత ఆమెకు అదృష్టం కలిసి వచ్చి
రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు
సినిమా తొలినాళ్లలోనే చేసి సూపర్ హిట్ అందుకొని స్టార్
హీరోయిన్ అయింది. దాదాపు
టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి తమిళంలో కూడా మంచి పాపులర్ అయింది. అక్కడ కూడా ఈమె స్టార్
హీరోయిన్ గా వెలుగొందింది. ఆమె చేసిన ప్రతి
సినిమా సూపర్ హిట్ కావడంతో
అనుష్క తో రెండు మూడు సార్లు నటించారు మన హీరోలు.
నాలుగేళ్లలో 20 సినిమాల్లో నటించిన ఈమె
టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది అని చెప్పవచ్చు. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు ఐటం సాంగులు కూడా చేస్తూ కుర్రకారు ను పిచ్చెక్కించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది
అనుష్క ఆరుంధతి
సినిమా తో ఒక్కసారిగా తన
మార్కెట్ ను మినిమం
హీరో స్థాయికి చేర్చుకుంది.
బాహుబలి సినిమా తో దేశస్థాయిలో ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు రాగా ఆ తర్వాత సినిమాలు చేయడం తగ్గించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రభాస్ తో
పెళ్లి చేసుకోబోతోంది అన్న పుకార్లు వినిపించగా అది నిజం కాదని తేల్చేసింది. తాజాగా ఈమె త్వరలోనే
పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. ఇది
టాలీవుడ్ కి పెద్ద షాకింగ్ విషయమే అయినా ఆమె కూడా జీవితంలో సెటిల్ కావాలిగా మరి.