కోలీవుడ్ లో క్రేజీ మాల్టీస్టారర్ మూవీ ఒకటి రెడీ అవుతుంది. అక్కడ స్టార్ హీరో విశాల్ మరో స్టార్ ఆర్యతో కలిసి చేస్తున్న సినిమా ఎనిమీ. ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుండి టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ చూస్తే సినిమా ఎప్పుడు చూసేయాలి అన్నంత ఎక్సయిటింగ్ ఏర్పడుతుంది. విశాల్, ఆర్య ఇద్దరు తమ పాత్రల్లో అదరగొట్టేశారని చెప్పొచ్చు. యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు.

ఇక టీజర్ లో ఉన్న ఒకే ఒక్క డైలాగ్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే.. అని ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ వస్తుంది. ఇక టీజర్ చివర్లో విశాల్, ఆర్య ఎదురెదురు పడే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంది. అఫ్కోర్స్ సినిమాకు కూడా అదే ఎండ్ ఫైట్ అని తెలుస్తుంది. విశాల్, ఆర్య ఇద్దరు స్నేహితులే కాని ఏదో విషయంపై విడిపోయి ఎనిమీస్ గా మారుతారు. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఎనిమీ సినిమా చూడాల్సిందే.

టీజర్ మాత్రం విజువల్స్ పరంగా చాలా బాగుంది. విశాల్, ఆర్య తమ పాత్రల్లో అదరగొట్టేశారని తెలుస్తుంది. సాం సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న విశాల్ ఎనిమీ సినిమాతో కూడా హిట్ అందుకునేలా ఉన్నాడు. ఈ సినిమాలో విశాల్, ఆర్య నువ్వా నేనా అన్నట్టు నటించారనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు అవన్ ఇవన్ తెలుగులో వాడు వీడు సినిమాలో నటించి మెప్పించారు.


 



మరింత సమాచారం తెలుసుకోండి: