అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమా విడుదల కాకముందే సినిమా నుండి బయటకు వచ్చిన పాటలు టీజర్ల ద్వారానే తెలుగు యువత మనసు కొల్లగొట్టిన ఈ అందాల భామ. తన అందచందాలతో అమాయకత్వపు చూపులలో కేవలం తెలుగు కుర్రకారు మనసు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ దృష్టిని కూడా తన వైపు లాక్కుంది. మొదటి సినిమాలో కృతి శెట్టి నటనకు కూడా మంచి మార్పులు పడడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. దానిలో భాగంగానే నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ' సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లింగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్. వీటితో పాటే నాగార్జున హీరోగా నటించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు సీక్వెల్గా తెరకెక్కబోతున్న 'బంగార్రాజు' సినిమా లోనూ ఒక పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.


 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా ఈ బ్యూటీ బుల్లితెరవైపు కూడా తన అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే జీ తెలుగు సంస్థ వారు తెలుగులో రూపొందిస్తున్న 'ముత్యమంతా ముద్దు' అనే సీరియల్ ప్రమోషన్ కోసం కృతి శెట్టి తొ ఒక ప్రమోషన్ వీడియో చేయించి ఈ మధ్య విడుదల చేశారు. కృతి శెట్టి సీరియల్ ప్రోమో లో కనిపించడం వల్ల ఇప్పటికే ఈ సీరియల్ పై బుల్లితెర అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రమోషన్ కి ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కృతి శెట్టి ఈ సీరియల్ ప్రమోషన్ కు కోటి రూపాయల వరకు తీసుకుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ,ఒకవేళ నిజమే అయితే ఒకే సినిమాతో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: