టాలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర ఫిల్మ్ ఇండస్ట్రీలో బాబీగా పాపులర్. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ కూడా. మొదటి చిత్రంతోనే బెస్ట్ డబ్ల్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు చిత్రాలను తెరకెక్కించిన ఈ యంగ్ డైరెక్టర్ మంచి హిట్ ట్రాక్ ను మెయింటెన్ చేస్తున్నాడు. "పవర్" తర్వాత పవర్ స్టార్ తో కలిసి "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా పవన్ అభిమానులు మెప్పించలేకపోయింది. ఆ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో "జై లవకుశ"తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యతో కలిసి "వెంకీ మామ" అనే మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాబి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర ఫిల్మ్ ఇండస్ట్రీలో బాబీగా పాపులర్. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ కూడా. మొదటి చిత్రంతోనే బెస్ట్ డబ్ల్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు చిత్రాలను తెరకెక్కించిన ఈ యంగ్ డైరెక్టర్ మంచి హిట్ ట్రాక్ ను మెయింటెన్ చేస్తున్నాడు. "పవర్" తర్వాత పవర్ స్టార్ తో కలిసి "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా పవన్ అభిమానులు మెప్పించలేకపోయింది. ఆ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో "జై లవకుశ"తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యతో కలిసి "వెంకీ మామ" అనే మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాబి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.