వరుస పాన్
ఇండియా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ
ప్రభాస్ నుంచి ఈ సంవత్సరం ఒక్క
సినిమా కూడా విడుదల కాలేదు. తన అభిమాన నటుడిని తెరపై చూసి చాలా రోజులు అయిపోయింది అని అని
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాహో సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆయన
సినిమా విడుదల కాకపోవడంతో ఒక్కసారిగా ఈ
సినిమా నిర్మాణ సంస్థ పై భారీగా కామెంట్లు చేశారు
ప్రభాస్ అభిమానులు. దర్శకుడుని అయితే భారీగా ట్రోల్ చేశారు. కానీ ఈ
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
2019లో
ప్రభాస్ ను తెరపైన చూశారు. 2020, 2021 సంవత్సరాలలో
ప్రభాస్ ను తెరపై చూడలేదు. దాంతో ఒక్కసారిగా అందరూ అభిమానులు కోపం వ్యక్తం చేశారు. అయితే రాధే
శ్యామ్ సినిమాను పక్కన పెడితే మిగతా సినిమాల విడుదల కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్న అనుమానాన్ని ప్రేక్షకులు వ్యక్తపరిచారు. అయితే
ప్రభాస్ రాధే
శ్యామ్ కు తీసుకున్నంత సమయం తన తదుపరి చిత్రాల కు తీసుకోడని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్
సినిమా ను వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట ప్రభాస్. గత రెండు సంవత్సరాలుగా ఒక్క
సినిమా కూడా విడుదల చేయకుండా ఉండడం తో అభిమానులను ఆనంద పరచదానికి 2022 సంవత్సరంలో మూడు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే
సంక్రాంతి కానుకగా రాధే
శ్యామ్ విడుదల చేస్తున్నాడు. ఆ తరువాత వేసవిలో సలార్ సినిమాను, సంవత్సరం చివర్లో
బాలీవుడ్ ఆది పురుష్
సినిమా ను విడుదల చేస్తున్నాడు. ఇది తెలిసి
ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.