తెలుగు రాష్ట్రంలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంచలనంగా మారింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పట్టపగలు నడిరోడ్డుపై శశి కృష్ణ అనే ప్రేమోన్మాది ఆ అమ్మాయిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సోషల్ మీడియా వేదికగా "వాడిని కూడా ఎవరైనా అలా నరికేస్తే... ఆ నరికిన వాడితో పడుకుంటాను... ఐయాం సారీ! ఆ వీడియో చూశాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు... అంత నిస్సహాయ స్థితిలో ఉన్నాము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్య నీకు న్యాయం జరగాలి. రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్" అంటూ సంచలన పోస్ట్ చేసింది. దీనికి తోడుగా "ఊసరవెల్లి" చిత్రంలో తమన్నా ఎమోషనల్ పిక్ ని షేర్ చేసింది. వైజాగ్ నుంచి హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రేఖ దామిని విల్లా, రంగేలా వంటి పలు చిత్రాల్లో నటించింది.

ఇక దేశమంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటుంటే మరోవైపు రమ్య శ్రీ హత్యకు గురికావడం మాయని మచ్చగా మిగిలిపోయింది. దీన్నే స్వాతంత్య్రం అనుకోవాలేమో! తొందరగానే నిందితుడిని పట్టుకున్న పోలీసులు స్థానికులు ఘటన జరుగుతున్నప్పుడు స్పందించి ఉంటే ఆమె బ్రతికేది అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏం జరిగినా మాకెందుకులే అనుకుని చోద్యం చూసే ఈ జనాలకు వారి దాక వస్తే కానీ అర్థం కాదు. కానీ అంత లోపు ఎంతమంది రమ్యశ్రీ లను బలి తీసుకుంటారో... అమ్మాయిలకు ఈ సమాజంలో భద్రత లేదు. సోషల్ మీడియాలోనూ ఏమాత్రం రక్షణ లేదు. ఎటు తిరిగి అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఆడవాళ్ళు దేశాన్ని ఏలే స్థాయిలో అభివృద్ధి జరిగినా రక్షణ మాత్రం ఇంకా వెనకబడి పోయే ఉంది. నిందితుడికి గట్టి శిక్ష పడేదాకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆగ్రహం తగ్గేలా కనిపించడం లేదు. మరో రమ్యశ్రీ ప్రాణాలు పోగొట్టుకోక ముందే ఈ ఘటనపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: