తెలుగు సినిమా పరిశ్రమ ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఏ జోనర్ లో సినిమా చేసినా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరించే సినిమాలలో కుటుంబ కథా చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి కథలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తన కుటుంబాన్ని ఊహించుకుంటూ పోల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. అందుకే ఈ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాటిలో ఒక కుటుంబ చిత్రం గురించి మనము తెలుసుకుందాం. ఈ సినిమా "స్నేహం కోసం" అనే టైటిల్ తో తెరకెక్కింది. సరిగ్గా జనవరి 1 1999 లో విడుదలైంది "స్నేహం కోసం" చిత్రం.
ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. కొడుకు మరియు తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నాడు. చిరంజీవికి జోడీగా మీనా నటించింది. ఇతర పాత్రల్లో విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్, సితార, కోట, తదితరులు నటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కె యస్ రవికుమార్ తెరకెక్కించారు. ఈ సినిమా పూర్తిగా కుటుంబంలోని బంధాలను, ఆప్యాయతలను ఒక వైపు చెబుతూనే సమాంతరంగా స్నేహం యొక్క గొప్పతనం మరియు విలువను తెలియచేశాడు. ఇందులో తండ్రి పాత్రలో చేసిన చిరంజీవి మరియు మీనా తండ్రి విజయ్ కుమార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కంటికి  కనువిందు చేస్తాయి.
ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించేది వీరిద్దరి నటన మరియు వారి స్నేహ బంధం.

ఈ సినిమాలో స్నేహం కోసం ఏదైనా చేయగల బంధం వారిద్దరిదీ. సినిమాలో భాగంగా వచ్చే ఒక సన్నివేశంలో అల్లుడి చేసిన హత్యకు .. తన స్నేహితుడి ఇంటి పరువు పోకూడదు అని గొప్ప మనసుతో, ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. అలా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తాడు. చివరి వరకు తన వలన తన స్నేహితుడి కుటుంబం విడిపోకూడదని ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకుంటాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీన్ లు కంటి నీరు తెప్పిస్తాయి.  ఈ సినిమాలో స్నేహం గురించి చెప్పే పాట అయితే హైలైట్ అని చెప్పాలి.
సినిమా క్లైమాక్స్ లో జరిగిన ఫైట్ లో తండ్రి పాత్రలో ఉన్న చిరంజీవి చనిపోతాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు విజయ్ కుమార్ గుండెలు పగిలేలా ఏడుస్తూ తను కూడా స్నేహితుడి లేని ఈ లోకాన్ని విడిచి స్నేహితుడి కోసం ప్రాణాలను వదిలేస్తాడు. కొడుకు పాత్రలో నటించిన చిరంజీవి కొంచెం ఆవేశం గల పాత్రలో మొదట్లో తన నాన్నను అర్థం చేసుకోక పోయినా తర్వాత నిజం తెలిసి చాలా బాధపడుతాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలలో చేసిన వారంతా పరిధి మేరకు నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: