అక్కినేని
అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్
వాంటెడ్ బ్యాచిలర్
సినిమా దసరా సందర్భంగా
అక్టోబర్ 8వ తేదీన విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా గీతాఆర్ట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాదే పూర్తి కాగా
కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని
అక్టోబర్ లో విడుదల చేస్తున్నామని చిత్ర బృందం చెప్పగానే అక్కినేని అభిమానులలో ఎక్కడలేని సంతోషం మొదలైంది.
గత మూడు చిత్రాలు గా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయిన అక్కినేని
అఖిల్ ఈ చిత్రంతో సూపర్ హిట్ సాధించుకుని ఫుల్ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ
సినిమా నుంచి వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ లు కూడా సినిమాపై భారీగానే అంచనాలు పెంచగా తాజాగా ఈ
సినిమా నుంచి వచ్చిన ఈ పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ పాట విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు మూడు మిలియన్ వ్యూస్ అందుకునీ
యూట్యూబ్ లో ట్రెండ్ గా మారింది.
సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు
గోపీసుందర్ సంగీతం సమకూర్చగా ఈ సినిమాలో ఈ గాయకుడు రెండు పాటలు పాడడం విశేషం.
ఇకపోతే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు మాత్రం భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ
సినిమా తర్వాత అక్కినేని
అఖిల్ సురేందర్
రెడ్డి దర్శకత్వంలో వెంటనే యాక్షన్
థ్రిల్లర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ
సినిమా శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబు అవుతుంది. ఈ నేపథ్యంలో లో చేసిన తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకొని అక్కినేని
అఖిల్ ఈ రెండు చిత్రాలతో భారీ కం బ్యాక్ చేస్తాడో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఇప్పటివరకు విడుదలైన మోస్ట్
వాంటెడ్ బ్యాచ్లర్ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విపరీతంగా ఆదరించారు.