అక్కినేని
నాగ చైతన్య హీరోగా నటించిన
లవ్ స్టోరీ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా మొదటి నుంచి ఈ
సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్
ఈవెంట్ తర్వాత ఈ
సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన చిత్ర బృందం వారి వారి ఇంటర్వ్యూ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ రాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లైన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సినిమా కథ ముందే తెలిసిన
శేఖర్ కమ్ముల తన మ్యజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని
సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన గత చిత్రాలలో
సినిమా కథ పెద్దగా లేకున్నా పాత్రల ద్వారా పండించే ఎమోషన్స్ మరియు తన డైలాగ్ లతో ప్రేక్షకులను మైమరిపి చేశారు. ఇప్పుడు కూడా అదే విధమైన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అని చెబుతున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఈ
సినిమా జయం నువ్వు నేను ప్యాట్రన్ లోనే ఉంది అని పెదవి విరిచారు.
నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంటుందని స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పి సినిమాను వెనకేసుకొచ్చారు చిత్రబృందం.
అయితే సోషల్ మీడియాలో మరొక వాదన వినబడుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో కులం అనే ప్రతిపాదనను పెట్టుకొని
సినిమా మొత్తాన్ని నడిపించారట. ఇది పాత కాన్సెప్ట్ అయినప్పటికీ ఈ సినిమాలో ఏ విధంగా దాన్ని చొప్పించి ప్రేక్షకులను మెప్పించే విధంగా చేశారనేది అసలు పాయింట్. ఈ నేపథ్యంలో నాగ చైతన్య నటన
సాయి పల్లవి డాన్స్ లు కూడా కొత్తగా ఉంటే గాని ఈ
సినిమా ప్రేక్షకులను మెప్పించదు. పాత రూట్ లోనే వెళితే మాత్రం ఈ
సినిమా కు కూడా దెబ్బ పడటం ఖాయం అని అంటున్నారు. పవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులలో ఎంతో ఇంట్రెస్ట్ కలిగించగా సినిమాపై అంచనాలు పెరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.