మహేష్ బాబు, నమ్రత 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాతో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాదు.. వీరిద్దరూ కొన్నేళ్లపాటు లవ్ ట్రాక్ నడిపించి చివరకు పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో అతికొద్ది మంది సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక 2005 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మోస్ట్ క్రేజీ కపుల్గా కలర్ఫుల్ లైఫ్ ఆస్వాదిస్తున్నారు. వారి వివాహ బంధంలో ఎన్నో అపురూమైన జ్ఞాపకాలు ఏర్పర్చుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నమ్రత పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంది. వారిద్దరి ప్రేమ గురించి నమ్రత ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. మహేష్ బాబు, నమ్రత వంశీ' సినిమా సమయంలోనే ఒకరినొకరం ఇష్టపడ్డామని, అయిదు సంవత్సరాల పాటు డేట్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వీరిద్దరూ రెండేళ్ల తర్వాత తమ ప్రేమ బంధాన్ని సీరియస్గా తీసుకొని పెళ్లికి రెడీ అయ్యామని తెలిపారు. అయితే మొదటిసారి మహేష్ని చూసినప్పుడే ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని, ఓ ఇన్నోసెంట్ అనిపించిందని, అయన ఇచ్చిన మర్యాదకు ఫిదా అయ్యానని నమ్రత పేర్కొన్నారు.