పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'రాధేశ్యామ్'. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగు ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. సినిమా విడుదల సమయం చూస్తే ఇంకా 45 రోజులు కూడా లేదు. అయినా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ఏ మాత్రం ఊపు అందుకోలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ గోల గోల చేస్తే తప్పా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయలేదు.

 రాధే శ్యామ్ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వమంటూ చిత్ర యూనిట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక టార్చర్ చూపించారు. దీంతో సినిమా నుండి ఈ రాతలే అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ విడుదల విషయంలో కూడా చాలా ఆలస్యం జరిగింది. మరోవైపు హిందీ వెర్షన్ కూడా విడుదల చేయలేదు. ఇక మొదటి పాటను విడుదల చేశాక మళ్లీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి సందడీ లేదు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సినిమాలోని రెండో పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్స్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా సౌత్ వెర్షన్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ నుంచి విడుదలయ్యే రెండో పాటకు ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ గానం అందించినట్లు తెలుస్తోంది. ఇక సిద్ శ్రీరామ్ పాటలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. దీంతో ప్రభాస్ రా రాధే శ్యామ్ లో కూడా సిద్ శ్రీరామ్ మ్యాజిక్ ఎలా ఉండబోతుంది అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాలో రెండో పాటని సిద్ శ్రీరామ్ పాడబోతున్నట్లు తెలియడంతో ఈ పాట పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇటలీ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: