ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం ఒకే ఒక మంత్రం జపిస్తుంది అని చెప్పాలి. ఇటు నిర్మాతలు అటు దర్శకులు హీరోలు, హీరోయిన్ లి అందరు కూడా ఈ పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగానే ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నారు. బాహుబలి సినిమా ఒక్కసారిగా వీరి మైండ్ సెట్ మార్చేసింది అని చెప్పాలి. ఆ చిత్రంతో భారీ స్థాయిలో ప్రభాస్ ఇమేజ్ అందుకుని ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా అవతరించగా వంద కోట్లకు పైగా రెమ్యురేషన్ తీసుకొని అందరి హీరోలు ఆశ్చర్య పోయేలా చేస్తున్నాడు.

ఆ విధంగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.. పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై భారీ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఫోబియా నుంచి ఇప్పటికీ టాలీవుడ్ సినిమా పరిశ్రమ కోలుకోవడం లేదనే చెప్పాలి. ఆ చిత్రం పలు భాషలలో రీమేక్ కాగా అక్కడ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అలా సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటూ విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని చిత్రాలు కూడా ఫ్యాన్ ఇండియా సినిమాలే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆయనకు ఆయన సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అక్కడి ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: