రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకుండా ఉన్నారు. అందుకే ఆయన ఇప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉన్నాడు. మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యేలోపు వీలైనన్ని సినిమా లు చేయాలి అనేది ఆయన ఆలోచన. అలా తన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు ఈ హీరో. పవన్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం 2018 లో విడుదల కాగా 2021 వరకు ఒక్క సినిమా ను కూడా విడుదల చేయలేదు. 

వకీల్ సాబ్  అనే ఒకే ఒక చిత్రాన్ని విడుదల చేశాడు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.  ఆ విధంగా 2021 సంవత్సరం దాకా మూడు సంవత్సరాలుగా ఎలాంటి సినిమాను విడుదల చేయకుండా పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు అని చెప్పాలి. అయితే ఆ నిరుత్సాహానికి ఫలితంగా వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేసి వారి ఆకలి తీర్చాడు పవన్. అంతేకాదు ఆ తరువాత వరుసగా నాలుగు సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ ఎంతగానో ఖుషీ చేశాడు.

ఇక ఆయన హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న పెద్ద హీరో సినిమా ఇదే కావడంతో ఆ నెలలో ఆయన భారీగా సందడి చేయడం ఖాయం అని తెలుస్తోంది. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండడం విశేషం. నిత్యా మీనన్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది ఈ చిత్ర బృందం. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియుం అనే చిత్రానికి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: