బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే జబర్డస్త్ షో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో ద్వారా ఎంతో మందికి జీవనోపాధి దొరికింది. ఈ షో ద్వారా యాంకర్స్‌కి, కమెడియన్స్‌కి మంచి పేరు, గుర్తింపు లభించింది. ఇదే షో ద్వారా పరిచయమైనా కొంతమంది కమెడియన్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు.

ఇక బుల్లితెరపై హైపర్ ఆది వేసే పంచ్‌లు, అందులో అనసూయతో ఆడుకునే తీరు ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హైపర్ అది తన మనసులోని కోరికలు అలా బయటపెడతాడా? లేదా కేవలం స్కిట్ కోసం అలా స్క్రిప్ట్‌లో డైలాగ్స్ రాసుకుంటాడో ఏమో తెలీదు కానీ, అనసూయ మీద ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెడుతుంటాడు. అంతేకాదు.. ఆమెను కొన్ని స్కిట్లలో దారుణంగా ట్రోల్  చేస్తూ ఉంటాడు. అయితే ఈ వారం చేసిన పుష్ప స్పూప్‌లో దారుణంగా అనసూయను కించపరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ స్కిట్ లో మనో అంటూ.. నీయవ్వ తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రోజా, అనసూయలను మాత్రం కేవలం తగ్గేదేలే అని చెప్పుకొచ్చాడు. ఇక వాళ్లే అవ్వల్లా ఉన్నారు.. మళ్లీ అనడం ఎందుకు అంటూ కౌంటర్లు వేశాడు. అయితే దాక్షాయణిగా శాంతి స్వరూప్‌ను పెట్టి అనసూయ పరువంతా ఒక్కసారిగా తీశాడు. మరోవైపు అనసూయ, శాంతి స్వరూప్ ఒకేలా ఉన్నారట.. దాక్షాయణిగా ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ ఆది కౌంటర్ వేశాడు.

అంతేకాదు.. యాంకర్ అనసూయ ఏమీ అనలేక నవ్వుతూ కూర్చుంటుంది. అంతేకాక అనసూయ కాబట్టి పీక కోసింది.. శాంతి కాబట్టి ఉప్పెన అని మరో డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు ఆది. ఇక ఆది ఆ స్కిట్‌లో అనసూయ మీద పరోక్షంగా ఇలా పంచ్‌ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అయితే ఆది పంచ్‌లకు అనసూయ ఏం చేయలేక అలా అవాక్కైనట్టుగా చూస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: