ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో పుష్ప 85 కోట్ల కలక్షన్స్ తో రికార్డులు సృష్టించాడు. సుకుమార్ డైరక్షన్ లో పుష్ప పార్ట్ 1 ది రైజ్ అఖండ విజయం అందుకోగా ఇక రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి. అయితే పుష్ప పార్ట్ 2 కథ ఎలా ఉండబోతుంది అంటూ కొన్ని లైన్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒకటి పుష్ప రాజ్ కి జరిగే వెన్నుపోటు అన్నమాట. అల్లు అర్జున్ అదేనండి మన హీరో పుష్ప రాజ్ కేశవని తన సొంత మనిషిలాగా చూసుకుంటాడు.

అంతగా నమ్మిన కేశవ పుష్ప రాజ్ ని దెబ్బ కొట్టాలని చూసే వారితో చేతులు కలుపుతాడని తెలుస్తుంది. పుష్ప రాజ్ సెకండ్ పార్ట్ లో హైలెట్ సీన్స్ లో ఇది కూడా ఒకటని. కేశవ తనకి అన్యాయం చేశాడని అతన్ని నిలదీసే సన్నివేశం. కేశవ పుష్ప రాజ్ కి వెన్నుపోటు పొడిచే సన్నివేశాలు ఇవన్ని సెకండ్ పార్ట్ లో హైలెటెడ్ సీన్స్ అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు కేశవ చేసిన పని వల్లే శ్రీవల్లి పాత్ర అంతమవుతుందట. ఇలా సెకండ్ పార్ట్ లో కేశవ పాత్ర షాక్ ఇస్తుందని చెబుతున్నారు.

పుష్ప పార్ట్ 1 లో కేశవ పాత్ర బాగా పండింది. ఆ పాత్రలో చేసిన జగదీష్ కూడా చాలా బాగా చేశాడు. అయితే కేశవ తన పాత్ర సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ఏ ఇంటర్వ్యూలో లీక్ చేయట్లేదు. ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్ నుండి వచ్చిన వార్తల ప్రకారం పుష్ప పార్ట్ 2 ది రూల్ లో పుష్ప రాజ్ కి కేశవ వెన్నుపోటు పొడిచి గట్టి దెబ్బ వేస్తాడని టాక్. సుకుమార్ అందుకే కేశవ పాత్రకి కమెడియన్ ని పెట్టకుండా పెద్దగా ఎవరికి తెలియని వెబ్ సీరీస్ లు చేస్తూ వచ్చిన జగదీష్ ని సెలెక్ట్ చేశారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: