సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో  అనుకున్న సినిమా కథను వేరే హీరోతో చేయడం చాలా సర్వసాధారణమైన విషయం,  ఎందుకంటే ఆ సమయంలో ఆ హీరో కు ఆ కథ నచ్చక పోవచ్చు, లేకపోతే  ఆ హీరో ఆ సమయంలో వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాకు డేట్లు ఇవ్వలేక సినిమా నుంచి తప్పుకోవచ్చు. ఇలా వేరే ఇతర కారణాల వల్ల కూడా  ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ కొన్ని మార్పులు, చేర్పులతో వేరే హీరోతో తెరకెక్కిన సందర్భాలు అనేకం  ఉన్నాయి. అయితే అలా ఒక హీరోతో అనుకొని వేరే హీరోతో తెరకెక్కిన సినిమాల్లో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ లుగా నిలిచినవి ఉంటాయి, అలాగే బ్లాక్ బస్టర్ హిట్ లను సాదించిన సినిమాలు ఉంటాయి, ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింహాద్రి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి దర్శకుడిగా గొప్ప గుర్తింపు వచ్చింది, అలాగే ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు  హీరోగా కూడా తెలుగునాట అదిరిపోయే గుర్తింపు లభించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కథ ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట, కాకపోతే ఆ సమయంలో బాలకృష్ణ కు ఆ కథ నచ్చకపోవడంతో అదే కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.  అయితే అలా బాలకృష్ణ మిస్ చేసుకున్న ఆ కథను సింహాద్రి సినిమా గా ఎన్టీఆర్ తో తెరకెక్కించారు, ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో మాస్ హీరోగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఇది ఇలా ఉంటే సింహాద్రి మూవీ  కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు, అయితే విజయేంద్ర ప్రసాద్ గారే స్వయంగా సింహాద్రి కథను మొదట బాలకృష్ణ గారి కోసం రాసినట్లు తెలిపాడు, అది మాత్రమే కాకుండా బాలకృష్ణ గారి కోసం సింహాద్రి కథను తయారు చేసినప్పుడు అందులో ముగ్గురు హీరోయిన్ లు అని, ఆ తర్వాత ఒక హీరోయిన్ పాత్రను తీసివేసి ఇద్దరు హీరోయిన్ లు మాత్రమే ఉండే విధంగా కథను తయారు చేసినట్లు విజయేంద్రప్రసాద్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: