సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలను ఎంచుకుని ఒక రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం నటనకు ఎక్కువ స్కోప్ ఇస్తూ ఉన్న రోల్స్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కోవకు చెందిన హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, ప్రముఖ నటి అయిన మేనక కుమార్తె ఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే చదువుకుంటూ బాల నటిగా పలు సినిమాలలో నటించింది. 2013లో వచ్చిన గీతాంజలి అనే ఒక మలయాళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి నేను శైలజ అనే చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాని డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకున్నది. సావిత్రి క్యారెక్టర్ లో  కీర్తి సురేష్ చాలా అద్భుతంగా నటించింది. దీంతో సాధారణ ప్రేక్షకులు సైతం, ఈమె పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. కేవలం తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే పెంచుకుంటూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

అయితే గ్లామర్ పాత్రలు చేయకపోవడానికి కారణం ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది కీర్తి సురేష్.. ఎవరైనా నటిగా ప్రేక్షకులు ఇష్టపడాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న పాత్రలే తనను వెతుక్కుంటూ వచ్చాయి అని వాటితో ఆదరణ పొందాలని కేవలం గ్లామర్ పాత్రలకే  మొదటి ప్రాధాన్యత కానే కాదని తెలియజేసింది. అయినా తెరపై ఎలా కనిపించాలి అనే విషయంపై తనకు కొన్ని హద్దులు ఉన్నాయని వాటిని ఎవ్వరూ చేరలేదని.. అందుచేతనే గ్లామర్ పాత్రలు చేయలేదు అని తెలియజేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: