దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ నటించిన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కమల్ హాసన్ కి తగ్గట్టుగా ఏ సినిమా కూడా పడలేదు.. అయితే విక్రమ్ సినిమా తో కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని చెప్పవచ్చు మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకున్నది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో మరింత సక్సెస్ అందుకని మరొక మెట్టు పైకి ఎక్కారని చెప్పవచ్చు. ఓటీటీ అభిమానులు మాత్రం ఈ సినిమా ఓ టీటి లో విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం ఆరు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల కానున్నట్లు గా సమాచారం. అది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఓ టి హక్కులను కొనుగోలు చేసింది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగానే ఓటి లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి భారీగానే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఇందులో సూర్య కూడా గెస్ట్ రోల్ పాత్రలో కనిపించారు. అందుకు భారీగానే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు గా సమాచారం.


ఇక ఇందులో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటించారు దీంతో ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా హక్కులను హీరో నితిన్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది ఈ చిత్రానికి మంచి లాభాలు కూడా వస్తున్నట్లుగా సమాచారం. ఈ వీకెండ్ నాటికి సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.. దీంతో 3 సినిమా హవా భారీగా తగ్గిపోవడంతో మేజర్, విక్రమ్ సినిమాలకు బాగా ప్లస్ అయ్యింది. మరి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతోంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: