ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ సినిమాలతో పాటు తెలుగు, పంజాబీ , ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రీతి జింటా జనవరి 31 1975లో జన్మించింది. ఈ సందర్భంగా ఆమె గురించి స్పెషల్ స్టోరీ మనం ఇప్పుడు చూద్దాం. క్రిమినల్ సైకాలజీ విభాగంలో డిగ్రీ చదివిన తర్వాత సినిమాలలోకి అడుగు పెట్టింది ప్రీతి జింటా. 1998లో దిల్సే సినిమాతో అరగెంట్రం చేసిన ఈమె అదే సంవత్సరం సోల్జర్ సినిమాలో కూడా నటించి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా దిల్సే సినిమా ద్వారా తన నటనకు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది.

2000వ సంవత్సరంలో ఈమె నటించిన క్యా క్యా నా సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించడంలో సందేహం లేదు తన పాత్రలతో బాలీవుడ్ హీరోయిన్ పాత్రలని మార్చేసిన ఈమె వివిధ రకాల పాత్రలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా 2008 వరకు హిందీ ఇంగ్లీష్ చిత్రాలలో నటించి  పాపులారిటీతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈమె సామాజిక సేవకురాలు కూడా కొన్ని రోజులు దక్షిణ ఆసియా బిబిసి న్యూస్ ఆన్లైన్లో కాలం నిర్వహించిన ప్రీతి జింటా మంచి వ్యాఖ్యాత.. స్టేజ్ పెర్ఫార్మర్ కూడా..

తన మాజీ ప్రియుడు నెస్ వాదియాతో కలిసి పి జెడ్ ఎంసెట్ మీడియా అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది గతంలో ఎన్నో వివాదాలలో చెప్పకుండా ఈమె 2003లో భారత్ షాకే సమయంలో కూడా భారత మాఫియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల కోర్టులో ఏకైక సాక్షిగా నిలిచి నిర్భయంగా సాక్ష్యం చెప్పింది. ఈ సందర్భంగా ప్రీతి జింటాకు జాతీయ గాడ్ ఫ్రేమ్ ఫిలిప్స్ బ్రేవరీ అవార్డు కూడా లభించింది. మొత్తానికైతే తెలుగులో కూడా కొన్ని చిత్రాలు నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: