ఇటీవల సమ్మర్ కానుకగా విడుదలైన విరూపాక్ష సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయిధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన నటించిన మొట్టమొదటి సినిమా ఇది.దాదాపుగా 50 కోట్ల రూపాయల షేర్ని రాబట్టిన ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఓటిటి ఆడియన్స్ నుండి సైతం ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే త్రిలింగ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్త మీనన్ క్లైమాక్స్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని పదేపదే చూడొచ్చు. 

ఈ సినిమాలో ఆమె ఇచ్చే ట్విస్టర్ మామూలుగా ఉండదు. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ సినిమాలో తన యాక్టింగ్ ఉంది .ఈ ట్విస్ట్ ని చివరి వరకు ఏ ఆడియో కూడా కనిపెట్టలేరు. దీంతో ఈ సినిమా డైరెక్టర్ టేకింగ్ ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సంయుక్త మీనన్ ని కాకుండా అనుపమ పరమేశ్వరుని అనుకున్నారట.అంతేకాదు ఇది సాయి ధరంతేజ్ వ్యక్తిగత రిక్వెస్ట్ ని కూడా అప్పట్లో వార్తలు వినబడ్డాయి .ఆ సమయంలో అనుపమ పరమేశ్వరన్ ఒక మలయాళ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.

దీంతో అనుపమ పరమేశ్వరన్ కి బదులుగా ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్తమైన నీ తీసుకున్నారట. అయితే చాలాసార్లు అనుపమ పరమేశ్వరన్ కి మొదటి నుండి నెగటివ్ షేట్స్ ఉన్న పాత్రలు చేయాలంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పింది. అంతేకాదు ఒక సినిమాలో పూర్తిగా నెగటివ్ రోల్ చేయాలన్నది ఆమె కోరిక అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కాకపోయినా క్లైమాక్స్లో నెగిటివ్ సీడ్ లో అద్భుతంగా నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది అనుపమ పరమేశ్వర్. ఈ క్రమంలోనే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నందుకు చాలా ఫీల్ అయిందట ఆమె. మళ్లీ ఆమె కెరియర్ లో ఇలాంటి అద్భుతమైన సినిమా వస్తుందా రాదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: