బుల్లితెర స్టార్ యాంకర్ల లో ఒకరైన అనసూయ క్రేజ్ ను అంత కంతకూ పెంచుకుంటూ ప్రస్తుతం వరుస సినిమా లతో విజయవంతం గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.పుష్ప2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో అనసూయ నటిస్తున్నారు.

అనసూయ సినిమా లకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉండగా సక్సెస్ రేట్ కూడా ఒకింత ఎక్కువగానే ఉంది.

సోషల్ మీడియా లో కొన్నిరోజుల క్రితం విజయ్ దేవరకొండ అభిమానులను రెచ్చగొట్టే విధంగా అనసూయ పోస్ట్ లు పెట్ట గా ఆ పోస్టుల పై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.అయితే ఎప్పుడూ సంతోషం గా ఉండే అనసూయ తాజాగా పశ్చాత్తాపపడుతూ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.తాజా గా వెకేషన్ కు వెళ్లిన అనసూయ తన పెద్ద కొడుకు పుట్టినరోజు కావడం తో నచ్చిన ఆహారాన్ని తిన్నారట.జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ డిషెస్ తినకుండా ఉండాల్సిందని ఎక్కువ గా ఆహారం తీసుకోవడం తో కొవ్వుbను కరిగించాల్సి వస్తుందని ఆ విషయం లో ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు.అనసూయ విమానం అనే సినిమా లో కీలక పాత్రలో నటిస్తుండ గా ఈ సినిమా అయినా అనసూయ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

అనసూయకు చిన్న సినిమాల కంటే పెద్ద సినిమా లే ఎక్కువ గా మంచి పేరు ను తెచ్చిపెడుతున్నాయి.కథ, కథనం విషయం లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే అనసూయ సక్సెస్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది.వివాదాలు, విమర్శలకు దూరంగా ఉంటే అనసూయ కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.

అనసూయ బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండగా రీఎంట్రీ విషయంలో ఆమె నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది.రాబోయే రోజుల్లో యాంకర్ అనసూయకు సంచలన విజయాలు దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: