అక్కినేని యువ హీరో అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖిల్ కెరియర్ ప్రస్తుతం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి సినిమా నుండి ఇటీవల వచ్చిన ఏజెంట్ సినిమా వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. స్టార్ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోవడంలో విఫలమవుతున్నాయి.

ఆ మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమా కూడా హీరోయిన్ ఖాతాలోనే పడింది. అలా చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఏజెంట్ సినిమా ఫ్లాప్ తో బయటకు వచ్చిన అఖిల్ హిట్లు ఫ్లాపులతో ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నాడు అన్న ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని నూతన దర్శకుడు డైరెక్టర్ చేస్తున్నాడని సమాచారం.

దాంతోపాటు ఈ సినిమా ఒక పీడియాడికల్ సినిమాగా రాబోతుంది అని ఈ సినిమాకు 100 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి మరీ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ కెరియర్ లోనే మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన ఏజెంట్ సినిమా వరకి ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఒకటి కూడా లేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా ఏజెంట్ సినిమాను 70 నుండి 80 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ గత సినిమాలు అన్ని ఫ్లాప్ అయినప్పటికీ ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయించి అఖిల్తో సినిమా చేస్తుండడంతో రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అఖిల్ మీద నమ్మకం కంటే సినిమా సబ్జెక్టు పై ఉన్న నమ్మకంతోనే ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి ధీర అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: