
అయితే ఈమధ్య కాలం లో ఈమెకి సరైన సక్సెస్ రాలేదు. చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతుంది. అక్కినేని నాగ చైతన్య మరియు చందు మొండేటి కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుంది.రీసెంట్ గానే ఆమె స్టోరీ డిస్కషన్స్ లో కూడా జాయిన్ అయ్యారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది అట. ఇదే ఆమె కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు. మార్కెట్ లో తనకి ఉన్న క్రేజ్ కి తగ్గటుగగానే రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి నాగ చైతన్య తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 7 కోట్ల రూపాయిలు మాత్రమే, అంటే కేవలం రెండు కోట్ల రూపాయిలు తేడా అన్నమాట. ఇకపోతే గతం లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి కలిసి 'లవ్ స్టోరీ' అనే చిత్రం చేసారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, మరి అదే రేంజ్ మ్యాజిక్ ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.