
ఈ విషయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. ఆమెను ఎంతో మిస్ అవుతున్నాము. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్లో చేయబోయే నూతన నటీమణి కోసం సెర్చింగ్ మొదలెట్టాము. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ నుపుర్ సనన్ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం భవిష్యత్లో ఉంటుందని ఆశిస్తున్నాను.ఆసక్తికరమైన రోజులు రాబోతున్నాయి.. అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి అని మంచు విష్ణు తన పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమా పట్ల మంచు ఫ్యామిలీ చాలా ప్రత్యేకంగా కేర్ తీసుకుంటోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా వ్యవహరించనున్నారు.