కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో సైతం విశాల్ కు భారీ క్రేజ్ ఉంది. అయితే తాజాగా హీరో విశాల్ సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఓ సుదీర్ఘ పోస్ట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే పీఎం ప్రధాన మోడీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తాజా వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది."

 వెండితెరపై కూడా అవినీతి చూపిస్తున్నారు. దీనిని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీ బీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ  హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేనే స్వయంగా రెండు లావాదేవీలు చేశాను. ఒకటి మొదట స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు రెండు సర్టిఫికేషన్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాను. నా సినీ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. నా సినిమాని ఎలాగైనా నార్త్ లో రిలీజ్ చేయాలని అనుకున్న నాకు ఈ పరిస్థితి ఎదురవడంతో డబ్బు చెల్లించడం తప్ప 

నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈరోజు విడుదలైన సినిమా నుండి చాలా ఎక్కువ వాటా నా పేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తికి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేస్తుంది నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశం లేదు. ఆ అవినీతిని అందరూ చూడ్డానికి సాక్ష్యం కూడా ఇస్తున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: