ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.అయితే తాజాగా రష్మిక మందన నటించిన బాలీవుడ్ సినిమా ‘ యానిమల్ ‘ మూవీ చర్చల్లో నిలుస్తుంది.అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోతో లిప్ లాక్ సీన్లలో నటించి ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. అందువల్ల విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందనను ట్రోల్ చేస్తూ తెగ తిడుతున్నారు. మనకు తెలిసిందే రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుంది ఎప్పటినుంచో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ జంట కూడా ఏమీ స్పందించకపోవడంతో ఇది అందరూ నిజమే అనుకుంటున్నారు.అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలీదు కానీ విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు.  సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ హద్దులు మీరీ పోయి రష్మికను తెగ ట్రోల్ చేస్తున్నారు.


నిన్న మొన్నటి దాకా రష్మిక విజయ్ సొంతం అనుకున్నామని కనిపించిన ప్రతి ఒక్క హీరోకి ముద్దులు పెడుతూ ఉంటే ఎలా అంటూ విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.రీసెంట్ గా రష్మిక మందన రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి మొదటి పాటను కూడా విడుదల చేశారు.ఈ పాటలో రష్మిక, రన్బీర్ కపూర్ లిప్ లాక్ సీన్ లతో బాగా రెచ్చిపోయారు. మరి ముఖ్యంగా ఫ్లైట్లో రణ్బీర్ కపూర్ , రష్మిక మందన మధ్య వచ్చిన సన్నివేశాలు అయితే చూడటానికి విజయ్ అభిమానుల గుండెల్లో మంట పెట్టే విధంగా ఉన్నాయి.  ఆ ప్లేస్ లో రణబీర్ కపూర్ ను ఊహించుకోలేకపోతున్నారు విజయ్ అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందనను విజయ్ ఫ్యాన్స్ పచ్చి బూతులు తిడుతున్నారు. కేవలం ఒక పాటలో ఇన్ని ముద్దులా అని ఫైర్ అవుతున్నారు. వారి బూతులు తట్టుకోలేక రష్మిక తన కామెంట్స్ సెక్షన్ ని ఆఫ్ చేసేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: