సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం.. అలా వైకుంఠపురం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా గుంటూరు కారం సినిమా కావడంతో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీలా నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా నాగవంశీ తెరకెక్కిస్తూ ఉన్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు విడుదల చేస్తూ మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నారు.


ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది అంటూ తెలియజేయడంతో అభిమానులు చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థమన్, నాగ వంశీ హీరోయిన్ శ్రీలీల హింట్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ సింగిల్ సాంగ్ అప్డేట్ సైతం మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందులో మహేష్ బాబు బుగ్గ మీద శ్రీ లీల ముద్దు పెడుతూ ఒక పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది.


ఈ పాట విషయానికి వస్తే ఓ మై బేబీ అనే సాంగ్ ప్రోమో డిసెంబర్ 11న సాయంత్రం నాలుగు గంటలకి విడుదల చేయబోతున్నామంటూ తెలియజేశారు.. అలాగే ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నామంటూ చిత్ర బృందం తెలియజేసింది. దీంతో మహేష్ అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.. ఈ చిత్రంలో మహేష్ బాబుకు మరదలి పాత్రలో కనిపించబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం వినిపిస్తోంది. కానీ ఇందులో ఈమె పాత్ర మరింత ఇంపార్టెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా కాంబినేషన్లో ఈ పాట అదిరిపోయేలా ఉంటుందని రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించి అప్డేట్ మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: