బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్ర.. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే టైటిల్ తోనే రిలీజ్ చేయడం జరిగింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో నాగార్జున అమితాబచ్చన్, మౌని రాయ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించడం జరిగింది.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.ఈ సినిమా పార్ట్-2,3 కూడా ఉంటాయని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.

ఇటీవలే ఒక ఈవెంట్లో అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సీక్వెల్ తెలియజేయడం జరిగింది.. వాస్తవానికి మేము విడుదల తేదీని లక్ష్యంగానే నిర్ణయించుకున్నామని బ్రహ్మాస్త్రం మొదటి భాగం విడుదలైన తరువాత మూడు సంవత్సరాలకు పార్ట్ -2 విడుదల చేయాలనుకున్నాము.. అలాగే పార్ట్-2 విడుదల తేదీ 2025 దీపావళి బ్రహ్మాస్త్ర రెండవ భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నామని తెలియజేశారు. 2026 లో క్రిస్మస్ మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు.. అయితే కచ్చితంగా ఇదే తేదీలలో విడుదల చేస్తామని తెలుపలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతోందని తెలిపారు.


పరిస్థితులను బట్టి మారవచ్చు.. మేము బ్రహ్మాస్త్ర -6 విడుదల తేదీలను సైతం ప్రకటించుకుంటామంటూ కూడా అయాన్ తెలియజేయడం జరిగింది. ఇటీవలే రణబీర్ కపూర్ కూడా యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవడం జరిగింది. ఇదే ఊపులోనే బ్రహ్మాస్త్ర సీక్వెల్న తెరకెక్కిస్తే మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది మొదటిలో నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. మరి ఏ మేరకు బ్రహ్మాస్త్ర టు సినిమా ఆయన ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: