తెలుగు సినీ ప్రశ్నలు తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం "ఆ ఒక్కటి అడక్కు" అనే పక్క కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. మళ్లీ అంకం ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా మే 3 వ తరగతి విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించడంతో ఈ చిత్ర బృందం కూడా ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను అమ్మి వేశారు. 

మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు. ఇకపోతే రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ మూవీ ని ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అల్లరి నరేష్ , నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలో కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇందులో నరేష్ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: