సినీ చరిత్రలో ఇది ఒక బిగ్ మల్టీస్టారర్ మూవీ గా హిస్టరీలో నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . సాధారణంగా మల్టీ స్టారర్ హీరోలు అంటే ఒకరో ఇద్దరో ముగ్గురో కనిపిస్తూ ఉంటారు . కాగా  ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో నలుగురు టాప్ బడా పాన్ ఇండియా స్టార్స్ ని పెట్టి ఓ మూవీ ని చిత్రీకరించిపోతున్నాడట బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజలీల భన్సాలి . ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.  సంజయ్ లీల భన్సాలీ అంటేనే స్పెషల్ ఇమేజ్ ఉంటుంది .


మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ తో ఆయన సినిమా చేయబోతున్నాడు అన్న వార్త బాగా హీట్ పెంచేసింది . కాగా లేటెస్ట్ గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో నటించే హీరోలు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అదే విధంగా స్టార్ హీరో అల్లు అర్జున్ అదే విధంగా బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అక్షయ్ కుమార్ మలయాళం స్టార్ నటుడు పృధ్వీ రాజ్ సుకుమారన్.. ఇలా ఈ నలుగురు బడా పాన్ ఇండియా స్టార్స్ తో బిగ్ మల్టీస్టారర్ మూవీని చిత్రీకరించబోతున్నారట సంజయ్ లీలా భన్సాలి .



సాధారణంగా  ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో ఉంటేనే అసలు ఫ్యాన్స్ ని ఆపలేరు . ఇక ఇంత పెద్ద డైరెక్టర్ దర్శకత్వంలో నలుగురు బడా హీరోలా..? నో డౌట్ సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే మూవీనే ఇది అంటూ మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. చూద్దాం మరి సంజయ్ లీల భన్సాలీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో..? కానీ ఒక విషయంలో ఈయన నిజంగా గ్రేట్ అని చెప్పాలి. నలుగురు హీరోలతో సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్య ఇష్యూస్ వస్తాయి. అది తెలిసి కూడా ఈయన సినిమాని ఓకే చేసుకున్నాడు అంటే నిజంగా గ్రేట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: