హనుమాన్ చిత్రం ఎటువంటి అంచనాల లేకుండా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా జై హనుమాన్ సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేస్తామంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ చిత్రంలో కీలకమైన పాత్రలో కాంతార సినిమాలో నటించిన రిషబ్ శెట్టి నటిస్తూ ఉన్నారు. అయితే ఈ హీరో మాత్రం కాంతారా సినిమా సీక్వెల్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అందుకే జై హనుమాన్ సినిమాకి డేట్ లో అడ్జస్ట్ చేయలేకపోతున్నారని ఇయర్ సెకండ్ హాఫ్ లో జై హనుమాన్ సినిమాని షూటింగ్ మొదలుపెట్టి అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన పనులను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కాంతారా 2 పూర్తి చేసిన తర్వాతే బయటికి వచ్చేలా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నటుడుగానే కాకుండా డైరెక్టర్ గా కూడా రిషబ్ శెట్టి చేసి కాంతర సినిమాకి వ్యవహరిస్తున్నారు.



ఒకవేళ ఈ ఏడాది ఎండింగ్లో జై హనుమాన్ సినిమాకి డేట్ లో ఇచ్చిన కూడా సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని జరుపుకోవాలని కనీసం ఒక ఏడాది అయినా పడుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది జై హనుమాన్ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు. ఒకవేళ విడుదల అవుతే వచ్చే ఏడాది 2026 చివరిలో లేకపోతే 2027 సంక్రాంతికి వాయిదా వేసుకుని పరిస్థితి ఉంటుంది. జై హనుమాన్ చిత్రంలో రిషబ్ శెట్టి తో పాటుగా చాలామంది స్టార్స్ నటిస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్నారు. జై హనుమాన్ సినిమా అనే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో రెండు ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: