నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే బాలయ్య ఆఖరుగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నా డు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొంత కాలం క్రితం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహా రెడ్డి అనే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించి రెండు పాత్రల్లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతుంది అనే న్యూస్ వైరల్ అవుతుండడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇకపోతే వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక బాలకృష్ణతో గోపీచంద్ చేయబోయే తదుపరి మూవీ లో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఈ సారి కూడా రెండు పాత్రల్లో బాలయ్యను గోపీచంద్ అద్భుతంగా చూపిస్తాడు అని , ఆ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని బాలయ్య అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: