
సినిమా రంగంలో నటుడుగా.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్యకు ఈ అవార్డు రావడం అభిమానులకి ఫుల్ జోష్ ని నింపింది. కాగా సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డులు వేడుక జరిగింది . ఈ వేడుకలో బాలయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు . ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబం మొత్తం హాజరైంది . బాలయ్య కొడుకు మోక్షజ్ఞ బాలయ్య భార్య వసుంధర ..బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మిణి.. ఆమె భర్త లోకేష్ ...చిన్న కుమార్తె తేజస్విని అల్లుడు భరత్ ..బాలయ్య సిస్టర్ భువనేశ్వరి ..అందరూ ఈ వేడుకకు హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .
ఫ్యామిలీ ఫోటో కూడా దిగారు. అయితే అంతా బాగున్న మోక్షజ్ఞ లుక్స్ పట్ల మాత్రం జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . మోక్షజ్ఞ బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నాడు అని సినిమాల మోజులో పడి బరువు తగ్గిపోయి పూర్తిగా అంద విహీనంగా మారిపోయాడు అని మోక్షజ్ఞ లుక్ అసలు ఏమాత్రం బాగోలేదు అని ఇంత స్లిమ్ గా మారడం కూడా మోక్షజ్ఞకు అస్సలు సూట్ కాలేదు అంటూ మాట్లాడుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పై హ్యూజ్ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఇది ఆయన సినీ ఎంట్రీకి బాగా అడ్డు వస్తుంది..!